ఈసారి పాన్ ఇండియా లెవెల్లో “పొలిమేర 3” ప్రయోగం..

మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు క్రేజీ థ్రిల్లర్స్ లో ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసిన చిత్రం “మా ఊరి పొలిమేర” సినిమా కూడా ఒకటి. టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు అనీల్ విశ్వనాధ్ తెరకెక్కించిన ఆ చిత్రం ఓటిటిలో సెన్సేషనల్ హిట్ కాగా దీనికి రెండో సినిమా పొలిమేర 2 ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే భారీ హిట్ అయ్యింది.

ఇక ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగిస్తూ స్కేల్ ని కూడా మేకర్స్ పెంచుతూ వెళ్తుండగా ఇప్పుడు ఈ అవైటెడ్ సీక్వెల్ “పొలిమేర 3” ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి నిర్మాతగా మారి మొదటి సినిమాగా టేకప్ చేస్తుండగా ఫస్ట్ పార్ట్ ని నిర్మాణం వహించిన భోగేంద్ర గుప్త సహా నిర్మాతగా పార్ట్ 3 కి వ్యవహరించనున్నారు.

ఇక ఈ చిత్రం స్క్రిప్ట్ పనులు ఆల్రెడీ పూర్తి కాగా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. అతి త్వరలోనే సినిమా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్ సహా గెటప్ శ్రీను, పృథ్వీ, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్యలు ప్రధాన తారాగణంగా కనిపించనున్నారట.

Exit mobile version