ఫోటో మూమెంట్: తమ పార్ట్‌నర్‌లతో ఎన్టీఆర్-నీల్

ఫోటో మూమెంట్: తమ పార్ట్‌నర్‌లతో ఎన్టీఆర్-నీల్

Published on Sep 1, 2024 3:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఓకే చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 31వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇక నేడు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఉడుపి శ్రీ కృష్ణ మఠాన్ని తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ సందర్శించారు. ఈ పర్యటనలో ప్రశాంత్ నీల్ కూడా పాల్గొన్నారు. అయితే, తాజాగా తమ లైఫ్ పార్ట్‌నర్‌లతో ఈ హీరో అండ్ డైరెక్టర్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. సాయంకాల వేళ సముద్రం ఒడ్డున తమ పార్ట్‌నర్‌లతో ఈ హీరో అండ్ డైరెక్టర్ దిగిన ఫోటోను ప్రశాంత్ నీల్ భార్య తన ఇన్స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఇలా తమ ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించడంతో ఎన్టీఆర్‌ను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు