బుల్లితెర పై కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న “ఓం భీమ్ బుష్”

బుల్లితెర పై కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న “ఓం భీమ్ బుష్”

Published on Jul 11, 2024 8:28 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ కి కూడా ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం బుల్లితెర పై కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం 6.77 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ల పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు