మరోసారి బుల్లితెర పై బన్నీ సినిమాకి సెన్సేషన్ రెస్పాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బుల్లితెర పై కూడా అదే జోరును ఇప్పటికీ కనబరుస్తోంది. ఈ చిత్రం జెమిని టీవీ లో ఇటీవల మరోసారి ప్రసారం అయ్యింది. ఈ చిత్రం 6.16 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేయడం జరిగింది. పలుమార్లు ప్రసారం అయినప్పటికీ కూడా, ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే సెన్సేషన్ అనే చెప్పాలి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో నివేతా పేతురాజ్, సుశాంత్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బుల్లితెర పై కూడా ఇలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందించారు.

Exit mobile version