ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “స్వాగ్”

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “స్వాగ్”

Published on Oct 5, 2024 5:01 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ నటుడు శ్రీవిష్ణు కూడా ఒకడు. తనదైన సినిమాలతో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించడమే కాకుండా నటుడుగా కూడా తన వెర్సటాలిటీ చూపిస్తూ వస్తున్నాడు. అలా తాను చేసిన లేటెస్ట్ చిత్రమే “స్వాగ్”. దర్శకుడు హషిత్ గోలితో ఆల్రెడీ “రాజ రాజ చోర” అనే సినిమా చేసి సూపర్ హిట్ ని శ్రీవిష్ణు అందుకున్నాడు. దాని తర్వాత వచ్చిన ఈ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

మరి ఈ చిత్రం ఓటిటి పార్ట్నర్ పై అయితే ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. సో థియేటర్స్ రన్ తర్వాత ఈ చిత్రాన్ని ఇందులో చూడొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ, మీరా జాస్మిన్ తదితరులు నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు