సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతడికి ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే తన భార్యకు ఫోన్ చేసి తమ కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇక తన కొడుకు ప్రమాదం గురించి తెలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి వాకబు చేసినట్లుగా పవన్ వెల్లడించారు. సింగపూర్లో అవసరమైన సహకారం అందించవలసిందిగా అక్కడి హై కమిషనర్ కు దిశానిర్దేశం చేశారు. వారికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక వారితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి రఘు రామకృష్ణంరాజు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కె.ఆచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్., సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర సినీ నటులు, సినిమా రంగ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించారని పవన్ తెలిపారు.
నాయకులు, కార్యకర్తలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఇంతమంది మంచి మనసుతో ఆకాంక్షించి, ఆశీస్సులు అందించడంతో మార్క్ శంకర్ క్రమంగా కోలుకొంటున్నాడు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అని పవన్ తెలిపారు.