తెలంగాణకు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్..!

తెలంగాణకు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్..!

Published on Oct 21, 2020 12:32 AM IST


గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా మారింది. భారీ వర్షాలకు చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లో చాలా కాలనీలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు అందిస్తున్నారు.

అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ సీఎం సహాయనిధికి తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఓ పక్క కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో భారీ వర్షాలు కురుస్తుండడం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు. దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో వర్షపాతం నమోదవ్వడంతో చాలా మంది జీవనవిధానం చిన్నాభిన్నమయ్యిందని, తీవ్ర ఆస్తి నష్టం ఏర్పడిందని అన్నారు. అయితే పరిస్థితులు ఏమైనప్పటికి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి నా వంతు సాయంగా కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు జనసైనికులు, అభిమానులు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు