Tirumala: నేషనల్ వైడ్ వైరల్ గా పవన్ పోస్ట్..!

Tirumala: నేషనల్ వైడ్ వైరల్ గా పవన్ పోస్ట్..!

Published on Sep 20, 2024 1:00 PM IST

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పొలిటికల్ పనుల్లోనే కొంచెం బిజీగా ఉన్నారు. అలాగే తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” మేకర్స్ పవన్ కళ్యాణ్ ని కలిసి సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామని రివీల్ చేశారు. అయితే ఈ మధ్యలోనే ఒక షాకింగ్ ఘటన దేశాన్ని కుదిపేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి హిందువులు ఎంతో నిష్ఠగా కొలిచే తిరుమల తిరుపతి వేంకటేశుని ప్రసాదంలో ఎద్దు, పంది, చేపలు వంటి వాటి కొవ్వు ద్వారా వచ్చే నూనెలు ఉన్నాయని వచ్చిన వార్తలు పెను సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే దీనిపై సినీ ప్రముఖులు నుంచి కూడా కొందరు మాట్లాడారు.

మరి లేటెస్ట్ గా టాలీవుడ్ హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. బాలాజీ లడ్డు విషయంలో ఇలా జరగడం హేయమైన చర్య అని ఖచ్చితంగా దీనికి కారణమైన వారికి కఠిన శిక్ష పడుతుంది అని తెలిపారు. అలాగే దీనితో పాటుగా ఇలాంటివి అన్నీ చూస్తుంటే “సనాతన రక్షా బోర్డు” పెట్టడం ఎంతైనా అవసరం ఉందని పవన్ పిలుపునివ్వడం అనేది చర్చకి దారి తీసింది.

ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ లో అయితే ఈ పోస్ట్ కి బాగా రీచ్ వెళ్ళింది. అలాగే పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పవన్ మాటలకి మద్దతుగా నిలిచారు. ఇలా మొత్తానికి అయితే పవన్ పోస్ట్ మాత్రం ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు