డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్ “రక్షణ”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్ “రక్షణ”

Published on Jul 29, 2024 9:00 PM IST

సైకలాజికల్ థ్రిల్లర్ మంగళవారం విజయం సాధించిన తరువాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ రక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియోలో ఈ చిత్రం ఆగస్ట్ 1, 2024 నుండి ప్రసారం కానుంది.

దర్శకుడు ప్రణ్‌దీప్ ఠాకూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మానస్, రోషన్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. యశోద ఠాకూర్ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు