మరో ఓటిటి సిరీస్ ఓకే చేసిన “పెళ్లి చూపులు” నటి

మరో ఓటిటి సిరీస్ ఓకే చేసిన “పెళ్లి చూపులు” నటి

Published on Jul 22, 2024 3:00 PM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో యువనటి రీతూ వర్మ కూడా ఒకరు. మరి రీతూ వర్మ తెలుగు ఆడియెన్స్ కి “బాద్షా”, “పెళ్లి చూపులు” సినిమాలతో బాగా పరిచయం కాగా రీసెంట్ కోలీవుడ్ చిత్రం “మార్క్ ఆంటోనీ” లో కూడా కనిపించింది. అయితే మరిన్ని చిత్రాలు చేస్తున్న ఈమె కొన్నాళ్ల కితం “మోడ్రన్ లవ్ హైదరాబాద్” అనే సిరీస్ తో ఓటిటి ఎంట్రీ కూడా అందించగా ఈ సిరీస్ తర్వాత ఇప్పుడు మరో ఓటిటి సిరీస్ ని ఈమె ఓకే చేసినట్టుగా తెలుస్తుంది.

తాజాగా టాలెంటెడ్ దర్శకుడు “శ్రీకారం” ఫేమ్ కిషోర్ రెడ్డి రీతూకి ఓ లైన్ చెప్పగా ఆమెకి అది నచ్చిందట. మరి దీనితో ఈ ఈమె ఈ సిరీస్ కి ఓకే కూడా చెప్పేసినట్టుగా టాక్. అయితే ఈ సిరీస్ ని ప్రముఖ డిజిటల్ లీడింగ్ ప్లాట్ ఫామ్ లలో ఒకటైన డిస్నీ+ హాట్ స్టార్ వారు ప్రసారానికి తీసుకురానున్నారని తెలుస్తుంది. ఇక ఇవి మినహా రీతూ వర్మ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న చిత్రం “స్వాగ్” లో కూడా నటిస్తుండగా తమిళ్ లో నటించిన మరో చిత్రం “దృవ నక్షత్రం” సినిమా ఇంకా విడుదలకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు