మరో కొత్త సినిమాను ప్రారంభిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

మరో కొత్త సినిమాను ప్రారంభిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Published on Sep 9, 2024 5:43 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ జోరుమీద ఉంది. ఇప్పటికే తమ బ్యానర్ నుంచి ఏకంగా 44 సినిమాలను ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలుపెట్టింది. తమ బ్యానర్ నుంచి రాబోతున్న 45వ సినిమాకు సంబంధించి స్క్రిప్టును ఫైనల్ చేశారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను డార్క్ కామెడీ జోనర్‌గా తెరకెక్కిస్తున్నామని.. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఎస్.జె డైరెక్ట్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

అయితే, ఈ సినిమాలోని క్యాస్టింగ్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. టి.జి విశ్వ ప్రసాద్ స్పీడుకి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఈ ప్రొడ్యూస్ బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు