కర్ణాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోకి ఎంట్రీ ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

కర్ణాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోకి ఎంట్రీ ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Published on Sep 28, 2024 10:57 AM IST

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే కచ్చితత్వానికి, ఓ క్వాలిటీ ప్రొడక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ తన విజన్‌తో నిర్మిస్తున్న చిత్రాలు, ముందుకు వెళ్తున్న తీరుతో టాలీవుడ్‌లో ఓ బ్రాండ్ ఏర్పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు టీజీ విశ్వ ప్రసాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఓవర్సీస్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే.

ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై శాండిల్‌వుడ్‌ను ఏలేందుకు సిద్దమైంది. కన్నడ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి టీజీ విశ్వ ప్రసాద్ అడుగు పెట్టబోతున్నారు. కేఆర్‌జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై అక్కడ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. అక్కడ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వ ప్రసాద్ తమదైన ముద్రను వేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు