ఫోటో మూమెంట్: ప్రధానితో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.!

మన టాలీవుడ్ లో స్టార్ సంగీత దర్శకుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. మరి ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో సాలిడ్ ఆల్బమ్స్ ని ఇచ్చిన తాను ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చార్ట్ బస్టర్స్ ని అందించే పనిలో ఉన్నాడు. అయితే దేవి సినిమాలతో పాటుగా దేశ విదేశాల్లో పలు ఈవెంట్స్ ని కూడా చేస్తుంటాడని చాలా మందికి తెలిసిందే.

అలా రీసెంట్ గా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ లో హాజరైన ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ నుంచే మోడీతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ ఓ ఫోటోకి పోజివ్వడం అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో సహా నేషనల్ వైడ్ గా కూడా వైరల్ గా మారింది. దీనితో ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారగా దేవితో వర్క్ చేస్తున్న చిత్ర నిర్మాణ సంస్థల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version