బాలీవుడ్లోనూ పూజాకు గట్టిగానే అందుతోందట

బాలీవుడ్లోనూ పూజాకు గట్టిగానే అందుతోందట

Published on Mar 18, 2020 4:20 PM IST

టాలీవుడ్లో పూజా హెగ్డే స్టార్ డమ్ బాగా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం విజయం తర్వాత స్టార్ నటీమణుల జాబితాలో మొదటి స్థానంలోకి చేరుకుంది ఆమె. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్, అఖిల్ సినిమాలున్నాయి. ఇక దర్శకులు, హీరోలు మొదటి ఆప్షన్ కింద ఆమెనే పెట్టుకోవడంతో పారితోషకం పెంచింది పూజా. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు తీసుకుంటున్న మొత్తం రెండు కోట్లకు పైమాటేనట.

ఇక బాలీవుడ్లో అయితే ఆ పారితోషకం తెలుగు కంటే రెట్టింపు ఉందని టాక్. సల్మాన్ ఖాన్ చేస్తున్న ‘కబి ఈద్ కబి దివాళి’ చిత్రంలో పూజాను కథానాయికగా ఎంపిక చేశారు. సాజిద్ నడియడ్వాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాద సంజీ డైరెక్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే నటించిన గత చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు నాలుగు కోట్ల వరకు ముట్టజెబుతున్నారట. పూజా తెలుగు, హిందీల్లో చేస్తున్న ప్రస్తుత చిత్రాలన్నీ హిట్టైతే ఆ రెమ్యునరేషన్ ఇంకాస్త పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు