సంచలనం రేపిన కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే.!

సంచలనం రేపిన కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే.!

Published on Nov 8, 2020 6:24 PM IST


ఇప్పుడు మన తెలుగు మరియు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పూజా హెగ్డే కూడా ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ అందులో ఎలాంటి అనుమానమూ లేదు. అందుకు తగ్గట్టుగానే పూజా కూడా భారీ చిత్రాలతో బిజీగా గడుపుతుంది. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ తో నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్” ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చాక ఒక ఇంటర్వ్యూ లో దక్షిణాది సినిమాపై చేసిన కామెంట్స్ పెద్ద సంచలనమే రేపాయి.

దీనితో ఈ కాంట్రవర్సీ పూజకు పెద్ద తలనొప్పిని తెచ్చింది. ఇక ఈ అంశంపై పూజా ఒక క్లారిటీ ఇచ్చింది. తాను ఆ ఇంటర్వ్యూ లో అన్న మాటలు వేరే సందర్భానికి చెందినవి అని నాకు తెలుగు సినీ పరిశ్రమ ప్రాణం లాంటిది అని తన చిత్రాలను తనను అభిమానించే వారికి అర్ధం అయినా ఎలాంటి అపార్ధాలకు దారివ్వకూడదనే మళ్ళీ చెబుతున్నాను తనకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకు ఎంతో రుణపడి ఉన్నానని ఆ ఇంటర్వ్యూను పూర్తిగా చూడాలని పూజా హెగ్డే ఈ కాంట్రవర్సీకు తెర దించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు