టాక్ షోలో ప్రభాస్ సందడి.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్!

టాక్ షోలో ప్రభాస్ సందడి.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్!

Published on Oct 22, 2024 12:02 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తవగానే, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తాడు. అయితే, ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. ఒకట్రెండు టాక్ షోలలో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ టాక్ షోలో గెస్టుగా రానున్నాడు.

లెజెండరీ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ‘‘నీ ఉచ్ఛ్వాసం కవనం’’ అనే టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. ఇక ఈ టాక్ షోలోని లేటెస్ట్ ఎపిసోడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకున్న అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకోనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్‌ని ఆదివారం ఉదయం 9 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు.

దీంతో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజైన ఆగస్టు 23న గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు