యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత వ్యాప్తి చెందిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎంతో ఒదిగి మరింత స్థాయిలో ఎదిగిన వాడయ్యాడు. అయితే హీరోకు తగ్గట్టుగానే అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేస్తుంటారు.
అలా ఈసారి ప్రభాస్ అభిమానులు ఒక పెద్ద మూవ్ నే అందుకున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కూడా కాదు కర్ణాటకకు చెందిన ప్రభాస్ అభిమానులు తమ అభిమాన హీరోకు అద్భుతమైన డెడికేషన్ ను అందించారు. ఆ మధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా డార్లింగ్ మొక్కలను నాటారు.
ఇపుడు అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కర్ణాటకకు చెందిన ప్రభాస్ అభిమానులు కిడ్వాయి ఆసుపత్రి వారితో అసోసియేట్ అయ్యి ఒక మినీ ఫారెస్ట్ నే నాటి దానిని కాస్తా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు రెబల్ స్టార్ కృష్ణం రాజు గార్లకు డెడికేట్ చేసారు. ఇది మాత్రం ఒక అద్భుతమైన చర్యే అని చెప్పాలి. ఫ్యానిజంని ఎప్పుడూ ఇలాంటి వాటికి వినియోగిస్తే అప్పుడు ఎటు చూసినా ఏ ఇండస్ట్రీలో అయినా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.
#Power_Of_Fans! What you Sow so is the Reap. Expected this when @PrabhasRaju planted saplings under #GreenIndiaChallenge.
Elated to know that Fans of Bahubali from Karnataka in association with Kidwai Hospitals dedicated a mini #Forest to him & our Sr.RebelStar Krishnamraju garu. pic.twitter.com/fm3Sebg1Zf— Santosh Kumar J (@SantoshKumarBRS) October 31, 2020