ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా 2022లోనే ?

ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా 2022లోనే ?

Published on Jul 7, 2020 12:38 AM IST


నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అయితే, 2020లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళదని, విదేశాల నుండి రావాల్సిన అంతర్జాతీయ సాంకేతిక బృందం రాలేని పరిస్థితి ఉండటం, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించి కూడా విదేశాల్లోనే పని చేయాల్సి రావడంతో… ఇక ఈ సినిమాని కరోనా తగ్గాకే, 2021లో షూటింగ్ చేసి.. 2022లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారట. ఇప్పటికే కొంతమందితో ఫోన్ లోనే సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురును ఫైనల్ లిస్ట్ లో అనుకున్నారట. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు