‘మత్తు వదలరా 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్న ప్రభాస్

టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రేజీ సీక్వెల్ మూవీ ‘మత్తు వదలరా 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రితేశ్ రానా డైరెక్ట్ చేయగా శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమా కోసం వారు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, నేడు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

‘మత్తు వదలరా 2’ మూవీ ట్రైలర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయ్యిందని వారు వెల్లడించారు. అంతేగాక, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయబోతున్నట్లు వారు తెలిపారు. సెప్టెంబర్ 8న ఉదయం 11.07 గంటలకు ఈ ట్రైలర్ లాంచ్ ఉండబోతున్నట్లు వారు వెల్లడించారు. దీంతో అభిమానులు ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సత్య, శ్రీ సింహా చేసే కామెడీ ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించగా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version