ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తరువాత ఏ హీరోతో ?

ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తరువాత ఏ హీరోతో ?

Published on Oct 18, 2019 7:01 AM IST

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దాదాపు అవే కన్ఫర్మ్ అని అనుకున్నారంతా. కానీ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ప్రశాంత్ సినిమా ఎన్టీఆర్ తోనని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసి ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది కాబట్టి, ఈ సినిమా 2021లో వచ్చే అవకాశం ఉంది. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు