“సరిపోదా శనివారం” ప్రమోషన్స్ కి సిద్ధమైన ప్రియాంక మోహన్!

“సరిపోదా శనివారం” ప్రమోషన్స్ కి సిద్ధమైన ప్రియాంక మోహన్!

Published on Aug 8, 2024 6:32 PM IST


నాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. వీరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి చిత్రం ప్రేక్షకులను అలరించింది. మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ఆగస్టు 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ చిత్రం రిలీజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడం జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక సెల్ఫీను షేర్ చేసింది హీరోయిన్ ప్రియాంక మోహన్. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నట్లు పోస్టులో తెలిపింది. అయితే సెల్ఫీ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు