మరో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నాగవంశీ

టాలీవుడ్‌లో వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటిని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా మలుస్తున్న ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పటికే పలు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ఈ బ్యానర్‌పై వచ్చే సినిమాలను ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి తెరకెక్కిస్తుంటారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి మరో క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘‘దసరా రోజున రాజు తిరిగి పట్టుకొస్తాడు’’ అనే క్యాప్షన్‌తో ఓ భారీ సినిమాను ప్రకటించారు. బిగ్గెస్ట్ హిస్టారికల్ క్లెయిమ్‌గా ఈ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి మిగిలిన ఏ విషయాలను కూడా వారు వెల్లడించలేదు.

దీంతో దసరా రోజున ఈ బ్యానర్ అనౌన్స్ చేయబోయే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏమిటా.. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version