ప్లాప్ తర్వాత పూరీని ఎమోషనల్ చేసిన ‘RRR’ రచయిత ఫోన్ కాల్.!

ప్లాప్ తర్వాత పూరీని ఎమోషనల్ చేసిన ‘RRR’ రచయిత ఫోన్ కాల్.!

Published on Aug 11, 2024 10:59 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రాలకి సెపరేట్ ట్రెండ్ ఉంటుంది. అప్పటి వరకు ఒకలా ఉన్న హీరోని తన సినిమాతో ఇంకోలా మార్చేయడం పూరి స్పెషాలిటీ.. అందుకే ఏ హీరో అయినా కూడా పూరీతో వర్క్ చేయాలి అనుకుంటాడు. అలా పూరి చేసిన లేటెస్ట్ సినిమానే “డబుల్ ఇస్మార్ట్”. దీనికి మొదటి చిత్రం “ఇస్మార్ట్ శంకర్” తో హీరో రామ్ పోతినేనిని ఒక ఊహించని మేకోవర్ లో చూపించిన తాను ఇప్పుడు సీక్వెల్ తో రాబోతున్నాడు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వరంగల్ లో అట్టహాసంగా జరగగా పూరి జగన్నాథ్ తన గత చిత్రం ప్లాప్ విషయంలో జరిగిన ఒక ఎమోషనల్ సంఘటనని పంచుకున్నారు. లైగర్ ప్లాప్ తర్వాత ఇంకా ఏ సినిమా చేయాలి అని డిసైడ్ కాలేదు అని ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది అని తెలిపారు. తీరా అది చూస్తే విజయేంద్ర ప్రసాద్ గారి ఫోన్ కాల్ అట.

సినిమాలు హిట్ అయినపుడు కూడా కాల్ చేయని విజయేంద్ర ప్రసాద్ గారు ఇపుడు ఎందుకు చేసారు అనే డౌట్ లోనే కాల్ లిఫ్ట్ చేయగా మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని అడిగారని పూరి తెలిపాడు. దానికి ఇంకా ఏమీ అనుకోలేదండి అని పూరి బదులివ్వగా ఒకసారి ఏ సినిమా చేయాలి అనుకుంటున్నారో ఆ కథ ఒకసారి నాకు ముందు చెప్పండి అని విజయేంద్ర ప్రసాద్ పూరీని అడిగారట.

అయితే తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు ఇలా ప్లాప్ లు తీయడం నచ్చలేదని అందుకే కథలో ఏమన్నా లోపాలు ఉంటే అవేంటో చూద్దామని అడిగారని నాకు అలా కాల్ చేసేసరికి ఎంతో ఎమోషనల్ అయ్యిపోయాను అని పూరి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు. దీనితో ఈసారి కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యి డబుల్ ఇస్మార్ట్ ని చేశాను అని తెలిపారు.

అయితే ఈ కథ విజయేంద్ర ప్రసాద్ గారికి చెప్పలేదు కానీ హిట్ కొట్టే ఆయనకి ట్రీట్ ఇస్తాను అన్నట్టుగా పూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి గ్లోబల్ హిట్ RRR లాంటి సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ కే పూరి అంటే ఎంతో ఇష్టం.. ఇప్పటికీ పూరి ఫోటోనే విజయేంద్ర ప్రసాద్ గారి ఫోన్ స్క్రీన్ పై ఉంటుంది అని ఆయన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరి అలాంటి రచయిత ఫేవరేట్ డైరెక్టర్ హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు