‘పుష్ప – 2’ : ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్ల భారీ ఖర్చు ?

‘పుష్ప – 2’ : ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్ల భారీ ఖర్చు ?

Published on Feb 28, 2024 3:01 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, సునీల్, అనసూయ, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప2 మూవీలోని జాతర యాక్షన్ సీన్ గురించే చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఇంటర్వెల్ లో వచ్చే ఈ ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 50 కోట్ల రూపాయలను మేకర్స్ ఖర్చు చేస్తిన్నట్లు టాక్. మొత్తంగా 25 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు సమాచారం. మరి అందరిలో రోజురోజుకు ఎన్నో అంచనాలు ఏర్పరుస్తున్న పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు