‘పుష్ప-2’ క్లైమాక్స్.. ‘పోతారు.. మొత్తం పోతారు’ అంటోన్న మేకర్స్!

‘పుష్ప-2’ క్లైమాక్స్.. ‘పోతారు.. మొత్తం పోతారు’ అంటోన్న మేకర్స్!

Published on Aug 26, 2024 3:01 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఓ అభిమాని ఈ క్లైమాక్స్ షూట్ ఎలా వచ్చిందని అడిగాడు. దీనికి ‘పుష్ప-2’ మేకర్స్ ఇంట్రెస్టింగ్‌గా సమాధానం చెప్పారు. న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ నుంచి ‘‘పోతారు.. మొత్తం పోతారు..’’ అనే డైలాగ్‌తో ‘పుష్ప-2’ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మొత్తానికి ‘పుష్ప-2’ మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని.. ఈ సినిమాతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని వారు క్లూ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుండగా, అందాల భామ రష్మిక మందన్న మరోసారి తన నటనతో అలరించనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘పుష్ప-2’ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు