‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందీప్ కిషన్ ప్రస్తుతం ‘రా రా కృష్ణయ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ సరసన రెజినా కాసాండ్రా హీరోయిన్ గా నటిస్తుంది. ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ‘రా రా కృష్ణయ్య’ ఆడియోను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో విడుదల చేయనున్నారు.
సందీప్ కిషన్ కు అన్నగా జగాపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నా ఈ సినిమా జూన్ నెలలో విడుదల కానుంది.


