పెళ్లాడి పిల్లల్ని కనాలని ఉంది – రాశీఖన్నా

హీరోయిన్ రాశీఖన్నా తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఈవెంట్‌ లో పాల్గొన్న రాశీ ఖన్నా తన మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తూ.. ‘నా పెళ్లి పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి నిజం కాదు. ఐతే, నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. కానీ నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. అయినా, నా పెళ్లి అనేది నా పర్సనల్ మ్యాటర్. కాబట్టి ఇక్కడ దాని గురించి డిస్కస్ చేయాలనుకోవడం నాకు ఇష్టం లేదు’ అంటూ రాశీఖన్నా తెలిపింది.

రాశీఖన్నా తన ప్రొఫెషన్‌ గురించి కూడా మాట్లాడుతూ.. ‘నా ప్రొఫెషన్‌తో నా వివాహాన్ని ముడిపెట్టాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక రాశీఖన్నా నటించిన ‘సబర్మతి రిపోర్ట్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మధ్య రాశీఖన్నా “బాక్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరణ్మణై 5వ సినిమాని కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా, రాశీఖన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటిలో నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version