తెలుగు రాష్ట్రాల్లో 550కి పైగా థియేటర్లలో “రాయన్”

తెలుగు రాష్ట్రాల్లో 550కి పైగా థియేటర్లలో “రాయన్”

Published on Jul 26, 2024 2:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్. జూలై 26, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిపోయిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. ఈ చిత్రాన్ని దాదాపు 550కి పైగా థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నారు. ఇది సినిమాకి బాగా కలిసి వచ్చే విషయం. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ కెరీర్ లో 50 వ చిత్రంగా తెరకెక్కిన రాయన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు