‘రాధేశ్యామ్’ షూటింగ్ మొదలైందా..? అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్

‘రాధేశ్యామ్’ షూటింగ్ మొదలైందా..? అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్

Published on Sep 30, 2020 11:58 PM IST


ప్రభాస్ ప్రజెంట్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు వరకు షూటింగ్ ఇటలీలో జరిగింది. కరోనా వ్యాప్తి సమయంలో కూడ కష్టపడి ఒక షెద్యూల్ ముగించిన టీమ్ తప్పనిసరి పరిస్థితుల్లో చిత్రీకరణ నిలిపివేశారు. దాదాపు ఐదు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు షూటింగ్ మొదలయిందని వార్తలు వినబడుతున్నాయి.

ప్రభాస్ సహా ప్రధాన తారాగణం, టెక్నికల్ టీమ్ మొత్తం నిన్న రాత్రి ఇటలీకి బయలుదేరి వెళ్లినట్టు, రేపటి నుండి షూటింగ్ మొదలుకానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగానే రేపటి నుండి షూటింగ్ రీస్టార్ట్ కానుందా లేకపోతే ఇవన్నీ రూమర్లేనా అంటూ స్వీయ ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఒకవేళ సినిమా మొదలైతే నిర్మాణ సంస్థ అప్డేట్ ఇవ్వాలి కదా.. ఎందుకివ్వలేదు అంటూ అప్సెట్ అవుతున్నారు. కాబట్టి నిర్మాతలు అభిమానుల కోసమైనా షూటింగ్ విషయంలో స్పష్టత ఇస్తే బాగుంటుంది.

పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి సిరీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పిరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేస్తోందనే ప్రచారాం కూడ ఉంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత వచ్చిన ‘సాహో’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు