కీర్తి సురేష్ “రఘు తాత” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్!

కీర్తి సురేష్ “రఘు తాత” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్!

Published on Sep 9, 2024 9:05 PM IST


స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన రఘు తాత చిత్రం ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. నూతన దర్శకుడు సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. జీ5 ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని కలిగి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని జీ 5 తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు మరియు కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం హోంబలే ఫిలింస్ సంస్థ యొక్క తొలి తమిళ నిర్మాణం. సీన్ రోల్డాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్ ఎస్ భాస్కర్ మరియు దేవదర్శిని కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు