రాహు విజయంపై నమ్మకం వ్యక్తం చేసిన దర్శకుడు సుబ్బు వేదుల

రాహు విజయంపై నమ్మకం వ్యక్తం చేసిన దర్శకుడు సుబ్బు వేదుల

Published on Feb 25, 2020 10:50 PM IST

కృతి గార్గ్, అభిరామ్ వర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం రాహు. ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు వేదులతో మీడియా తో మాట్లాడుతూ.. నాది వైజాగ్, న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఆ సమయంలో కోనా వెంకట్ నాకు పరిచయం, మేమిద్దరం కలిసి కొన్ని స్టోరీస్ కు వర్క్ చేశాము. అనుకోని కారణాల వల్ల కోనా వెంకట్ గారితో గీతాంజలి 2 సినిమా స్టార్ట్ కాలేదు. కానీ నా ప్రయత్నాలు ఆపలేదు..
రాహు సినిమాలో ఒక అమ్మాయికి రక్తం చూసినప్పుడు బ్లైండ్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అలాంటి అమ్మాయి జీవితంలో రాహు ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ గా చూపించడం జరిగింది. సినిమా కంప్లీట్ గా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. మేకింగ్ స్టయిల్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా ఉండబోతొంది, అన్నారు.

ఇంకా మాట్లాడుతూ…కొత్త దర్శకుడిగా నేను పెద్ద స్టార్ట్స్ తో చెయ్యాలంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కావున ఈ సినిమా తరువాత నేను స్టార్ట్స్ ను అప్రోచ్ అవుతాను. ఒక స్టార్ హీరో కోసం మృగం అనే సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. చంద్రశేఖర్ యేలేటి గారి సినిమాలు అంటే ఇష్టం. అనుకోకుండా ఒకరోజు సినిమా నా ఫెవరేట్. నేను, నా కూతురు ఈ సినిమా లో ముఖ్య పాత్రలలో నటించాము. సురేష్ బాబు గారు మా సినిమాను విడుదల చేయడం, జీ వాళ్ళు డిజిటల్ రైట్స్ తీసుకోవడం మేము విడుదలకు ముందే సాధించిన విజయాలు. నా కథ మీద నమ్మకంతో నేను ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరించాను. మా నిర్మాతలు బాబ్జి, స్వామి గార్ల సహకారం మరువలేనిది, అన్నారు.

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల
నిర్మాతలు – ఏ వి
ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
డిఓపి – సురేష్ రగుతు ,ఈశ్వర్ యల్లు మహాంతి,
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ – అమర్ రెడ్డి
పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా

సంబంధిత సమాచారం

తాజా వార్తలు