ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్న రాజ్ తరుణ్ మూవీ

ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకున్న రాజ్ తరుణ్ మూవీ

Published on Sep 15, 2024 12:00 AM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాడు. 50 రోజుల వ్యవధిలో ఈ హీరో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’ థియేటర్లలో సందడి చేస్తోంది.

అయితే, ఆయన నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ‘పురుషోత్తముడు’, ‘తిరగబడర సామీ’ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి. ఇప్పటికే పురుషోత్తముడు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ‘తిరగబడర సామీ’ కూడా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ సినిమా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

తిరగబడర సామీ చిత్రాన్ని రవి కుమార్ చౌదరి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో మాల్వి మల్హోత్ర, మన్నార చోప్రా, మార్కండ్ దేశ్‌పాండే తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మాల్కాపురం శివ కుమార్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు