షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి!

షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి!

Published on Sep 11, 2024 1:27 AM IST

IIFA అవార్డ్స్ 2024 యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, పాన్ ఇండియా యాక్టర్ రానా దగ్గుబాటి, సిద్ధాంత్ చతుర్వేది మరియు అభిషేక్ బెనర్జీ వంటి పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. షారుఖ్ ఖాన్ మరియు కరణ్ జోహార్ లు రానా దగ్గుబాటిని స్తేజ్ మీదకి పిలిచారు. రానా దగ్గుబాటి, షారుఖ్ ఖాన్ మరియు కరణ్ జోహార్ ఇద్దరి పాదాలను తాకి, మేము పూర్తిగా సౌత్ ఇండియన్. మేము దీన్ని ఇలా చేస్తాము అని అన్నాడు. గౌరవ సూచకంగా నటుడు రానా దగ్గుబాటి చేసిన పనికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. IIFA అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ నెల 27 మరియు 29 మధ్య UAEలో జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు