లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి, స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్, మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ, పీఆర్ఓ – చందు రమేష్, బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ, సమర్పణ – నడిమింటి లిఖిత, నిర్మాత – నడిమింటి బంగారునాయుడు, దర్శకత్వం – లోకేష్ రనాల్ హిటాసో.