ఢిల్లీ నుండి నేరుగా వికారాబాద్ అడవులకు రకుల్

ఢిల్లీ నుండి నేరుగా వికారాబాద్ అడవులకు రకుల్

Published on Sep 21, 2020 11:43 PM IST


ఇటీవల మీడియాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు మారుమోగిపోయింది. బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఆమె పేరు కూడ ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బీయూరో జరిపిన విచారణలో నటి రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ పేరును వెల్లడించినట్టు వార్తలు ప్రసారమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ వార్తలు వైరల్ కావడంతో రకుల్ ప్రీత్ స్పందించక తప్పలేదు. హైదరాబాద్లో క్రిష్ సినిమా షూటింగ్లో ఉన్న ఆమె ఢిల్లీ వెళ్లి కోర్టును ఆశ్రయించారు.

మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను వెంటనే ఆపాలని ఆదేశించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించింది. కోర్టు సైతం అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకు రకుల్‌కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించకూడదని ఆదేశించింది. దీంతో రిలాక్స్ అయినా రకుల్ వెంటనే హైదరాబాద్ తిరిగొచ్చి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఇకపోతే ఇందులో రకుల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. చిత్రం పూర్తిగా కొండ ప్రాంతాల్లోని పల్లెలు, వ్యవసాయం, అక్కడి సమస్యల నేపథ్యంలోనే ఉంటుందట. భిన్నమైన, వాస్తవిక కథలతో సినిమాలు చేసే క్రిష్ డైరెక్షన్ కావడంతో ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు