రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం !

రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం !

Published on Sep 30, 2024 11:00 AM IST

ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ సింగపూర్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. టుస్సాడ్స్‌ బృందం ఐఫా వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అన్నట్టు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఆయన పెంపుడు కుక్క రైమ్‌ కలిసున్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేస్తుండటం విశేషం.

కాగా రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాం కోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు, ఫొటో షూట్‌ ని పూర్తి చేయడం జరిగింది. టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చారు. అన్నట్టు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ల మైనపు విగ్రహాల్ని అక్కడ పెట్టారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు రామ్‌ చరణ్‌ కూడా చేరబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు