నైజాంలో సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకి “డబుల్ ఇస్మార్ట్”

నైజాంలో సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకి “డబుల్ ఇస్మార్ట్”

Published on Jul 27, 2024 10:00 AM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “డబుల్ ఇస్మార్ట్”. మరి దీనికి ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ క్రేజీ హిట్ గా నిలవగా దీనిపై ఇప్పుడు డబుల్ అంచనాలు నెలకొన్నాయి. ఒకో పాట కూడా మంచి హిట్ గా నిలిచాయి. ఇక రిలీజ్ కి దగ్గరకి వస్తున్నా ఈ చిత్రానికి సాలిడ్ బిజినెస్ జరుగుతుండగా లేటెస్ట్ గా నైజాం రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

మరి ఈ చిత్రాన్ని అయితే టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూషన్ లో చేసిన చిత్రాల్లో దాదాపు 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ ని చూసిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు సొంతం చేసుకొని నైజాం మొత్తంలో రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసి భారీ లాభాలు అందుకున్నారు అలాగే వీరి డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా అంటే డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే మార్క్ ఉంది. సో ఇదే బాటలో డబుల్ ఇస్మార్ట్ కూడా పక్కా హిట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు