సంక్రాంతి పోరులో రామ్ ‘రెడ్’ నిలుస్తోందా ?

సంక్రాంతి పోరులో రామ్ ‘రెడ్’ నిలుస్తోందా ?

Published on Sep 20, 2020 1:10 AM IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఇక ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. ఎలాగూ జనవరి నాటికి థియేటర్లు తెరుస్తారని అంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే పవన్ వకీల్ సాబ్ తో పాటు, బాలయ్య – బోయపాటి సినిమా అలాగే ప్రభాస్ రాధే శ్యామ్ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి పెద్ద పోటీనే ఉండే అవకాశం ఉంది. అయితే అప్పటిలోపు కరోనా ప్రభావం తగ్గాలి. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రాకతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. ప్రస్తుతం దర్శకనిర్మాతలు రాబోయే రోజుల్లో పరిస్థితులను చూసుకుని పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే రామ్ రెడ్ ను కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు