రానా కారణంగా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిన నాగచైతన్య..?

రానా కారణంగా నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిన నాగచైతన్య..?

Published on Oct 21, 2024 6:12 PM IST


టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేగాక, ఆయన నిర్మాతగా, సమర్పకుడిగా కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాడు. అయితే, ఆయన కోసం వచ్చిన ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల్లోకి వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రానా దగ్గుబాటి కోసం కిషోర్ అనే కొత్త దర్శకుడు ఓ కథను రెడీ చేసి ఆయనకు వినిపించాడు. అయితే, రానా ఈ కథను చైతన్యకి రిఫర్ చేశాడు. అంతేగాక ఈ సినిమాకు సహ-నిర్మాతగా కూడా రానా ఉండబోతున్నాడట. ఇక కథ నచ్చిన చైతూ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో కథను చైతూ ఇమేజ్‌కి తగ్గట్లుగా మారుస్తున్నాడట డైరెక్టర్. బాహుబలి చిత్ర నిర్మాత ఆర్కే మీడియా వర్క్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించనుందనే వార్త వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు