‘డియ‌ర్ కామ్రేడ్’.. వెరీ స్పెష‌ల్ అంటోన్న ర‌ష్మిక‌

‘డియ‌ర్ కామ్రేడ్’.. వెరీ స్పెష‌ల్ అంటోన్న ర‌ష్మిక‌

Published on Jul 26, 2024 4:00 PM IST

నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మందన్న సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. త‌న సినిమాల గురించి, త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ప‌లు విష‌యాల‌ను షేర్ చేసుకుంటుంది. ఆమె సోష‌ల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అభిమానులు ఫాలో అవుతుంటారు.

అయితే, ఆమె తాజాగా ”డియ‌ర్ కామ్రేడ్” సినిమా గురించి ఓ పోస్ట్ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యింది. నేటికి ఈ సినిమా వ‌చ్చి 5 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది. ‘డియ‌ర్ కామ్రేడ్’ క‌థ‌ను విన్న ద‌గ్గ‌ర్నుంచి ఆ సినిమాకోసం క్రికెట్ ఆట‌ను నేర్చుకోవ‌డం, షూటింగ్ లో పాల్గొన‌డం వ‌ర‌కు చాలా క‌ష్ట‌ప‌డ్డామని..సినిమా ముగియ‌డంతో ఏదో తెలియ‌ని బాధ‌.. రిలీజ్ సంద‌ర్భంగా అభిమానుల‌తో క‌లిసి ఆడిపాడ‌టం.. రిజ‌ల్ట్ ఏదైనా 5 సంవ‌త్సరాలుగా త‌న‌పై ప్రేమ‌ను కురిపిస్తున్న అభిమానుల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని ర‌ష్మిక పేర్కొంది.

ఇక ఈ సినిమాలోని త‌న పాత్ర ‘లిల్లీ’గానే చాలా మంది త‌న‌ను ఇంకా పిలుస్తుండ‌టం త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిర్మాతలు మైత్రీ మూవీ మేక‌ర్స్ కు ఆమె త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు