రష్మిక మందన్నకు యాక్సిడెంట్.. అందుకే దూరం!

రష్మిక మందన్నకు యాక్సిడెంట్.. అందుకే దూరం!

Published on Sep 9, 2024 9:30 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే, గత నెల రోజులగా ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఆమెకు జరిగిన ఓ ప్రమాదం కారణంగానే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు పేర్కొంది.

ఓ చిన్న ప్రమాదం కారణంగా తాను ఇంటిదగ్గరే ఉంటూ రికవరీ అయ్యానని.. డాక్టర్లు ఈ మేరకు సూచించడంతోనే ఇంటి వద్ద రెస్ట్ తీసుకున్నట్లు ఆమె తెలిపింది. మనకు మనమే జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే జీవితంలో యాక్టివ్‌గా ఉండగలమని ఆమె ఈ సందర్భంగా తెలిపింది.

ఇక రష్మిక ప్రస్తుతం బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే, రష్మిక ప్రమాదం గురించి తెలుసుకుని అభిమానులు ఆమె ఆరోగ్యంపై నెట్టింట ఆరా తీస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు