క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా రేంజ్ ఇప్పుడు నేషనల్ రేంజ్. కిరాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో పరిచయమైన ఈ యంగ్ హీరోయిన్, అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్లోనూ వరుస అవకాశాలను అందుకుంటున్న రష్మిక, ప్రస్తుతం ఫోర్బ్స్ భారతదేశంలో ‘అత్యంత ప్రభావవంతమైన నటుల’ జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించింది.
పైగా రేసులో సమంతతో పాటు స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, యష్, అల్లు అర్జున్ లాంటి హీరోలను కూడా దాటుకుని టాప్ ప్లేస్ లో నిలిచింది. సౌత్ భాషల ప్రముఖులకు సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్, వ్యూస్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ లిస్ట్ ను తయారు చేశారు. రష్మికకు 10 పాయింట్లకు 9.88 పాయింట్లు వచ్చాయి. ఇక 9.67తో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచాడు. 9.54తో కన్నడ హీరో యశ్ మూడో స్థానం నిలిచాడు.