‘గం గం గణేశా’ నుండి ‘బృందావనివే’ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక

‘గం గం గణేశా’ నుండి ‘బృందావనివే’ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక

Published on Oct 5, 2023 12:01 AM IST

యువ నటుడు ఆనంద దేవరకొండ ఇటీవల బేబీ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతము చేసుకున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ ని సాయి రాజేష్ తెరకెక్కించారు. దాని అనంతరం ప్రస్తుతం ఆనంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గం గం గణేశా. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ యొక్క టీజర్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగమశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ మూవీకి అనురాగ్ పరవతేనేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి బృందావనివే అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలీజ్ చేసారు. ఈ సాంగ్ మంచి చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని, అలానే గం గం గణేశా మూవీ మంచి విజయం అందుకొవాలని టీమ్ కి ఆమె ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియచేసారు. సిద్ శ్రీరాం అద్భుతంగా పాడిన ఈ సాంగ్ ని వేంగి సుధాకర్ రచించారు. ప్రస్తుతం ఈ మెలోడియస్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు