‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ డ‌బ్బింగ్ ముగించేసిన మాస్ రాజా!

‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ డ‌బ్బింగ్ ముగించేసిన మాస్ రాజా!

Published on Jul 27, 2024 5:54 PM IST

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హరీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ర‌వితేజ మ‌రోసారి త‌న మాస్ యాక్ష‌న్ తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుండి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని త‌న పాత్ర‌కు మాస్ రాజా ర‌వితేజ డ‌బ్బింగ్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో ర‌వితేజ నోటి వెంట ఓ ప‌వ‌ర్ఫుల్ డైలాగ్ వినిపించింది.

ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో నటిస్తున్నాడు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీపై టిజి.విశ్వ ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు