బ‌జ్.. ర‌వితేజ‌ ఆ డైరెక్ట‌ర్ కి నో చెప్పాడా..?

మాస్ రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ‘మిస్ట‌ర్ బ‌చ్చన్’ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కూడా అభిమానుల‌ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పూర్తి కాక‌ముందే ర‌వితేజ త‌న నెక్ట్స్ ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్ర‌మంలోనే త‌న నెక్ట్స్ చిత్రాన్ని ‘జాతిర‌త్నాలు’ ద‌ర్శ‌కుడు అనుదీప్ డైరెక్ష‌న్ లో తెరకెక్కిస్తాడ‌నే వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికే అనుదీప్ కూడా ఓ స్క్రిప్టుని ర‌వితేజ‌కు వినిపించాడ‌ట‌. అయితే, క‌థ‌లో కొన్ని మార్పులు చేయాల‌ని మాస్ రాజా సూచించ‌డంతో.. అనుదీప్ కంత‌మేర మార్పులు చేసి మ‌ళ్లీ వినిపించాడ‌ట‌. కానీ, ర‌వితేజ‌కు ఆ క‌థ‌లోని మార్పులు న‌చ్చలేద‌ట‌. దీంతో అనుదీప్ కు ఆయ‌న నో చెప్పాడ‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది.

ర‌వితేజ నో చెప్ప‌డంతో ఇప్పుడు అనుదీప్ వేరొక హీరో కోసం చూస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తార‌నే టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో వేచి చూడాలి.

Exit mobile version