ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ హార్రర్ థ్రిల్లర్ ‘కళింగ’

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘కళింగ’ ముందునుంచి మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటిస్తూనే దర్శకుడిగా ధృవ వాయు తనదైన మార్క్ వేసుకున్నాడు. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. పూర్తి హార్రర్ అంశాలతో ఈ సినిమా థ్రిల్లర్ ప్రేమికులకు బాగా కనెక్ట్ అయ్యింది.

సెప్టెంబర్ 13న ఈ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మంచి టాక్‌ను సంపాదించుకున్న ‘కళింగ’ చిత్రం అతి తక్కువ సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘కళింగ’ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో హార్రర్ చిత్రాల ప్రేమికులు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా నయన్, ఆడుకాలం నరేన్, లక్ష్మణ్ మీసల, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విష్ణు శేఖర, అనంత నారాయణ్ సంగీతం అందించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version