ఎన్టీఆర్ తో కలిసి ఒక శుభప్రదమైన ప్రయాణం – రిషబ్ శెట్టి

ఎన్టీఆర్ తో కలిసి ఒక శుభప్రదమైన ప్రయాణం – రిషబ్ శెట్టి

Published on Sep 2, 2024 2:00 PM IST

జూనియర్ ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కుటుంబ సమేతంగా కర్ణాటక లోని ప్రముఖ పురాతన దేవాలయాల్ని దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా కేశవనాథేశ్వర గుహ ఆలయాన్ని ఎన్టీఆర్ సందర్శించారు. కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఇల్లు ఉన్న కెరడి మూడగల్లు గ్రామ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు హీరో రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత కూడా కేశవనాథేశ్వర గుహలో కొలువై ఉన్న పరమేశ్వరుని దర్శనం చేసుకున్నా రు.

కేశవనాథేశ్వర గుహ చుట్టూ ఉన్న ప్రాంతంలోని సహజ సౌందర్యానికి ఎన్టీఆర్ ఆకర్షితుడయ్యాడని.. ఆ అటవీ ప్రాంతం లోని పురాతన గుహలో
స్వయంభువుగా కొలువైన ఆ పరమేశ్వరుడిని తారక తో కలిసి దర్శించుకోవడం గొప్ప అనుభూతి అని ఓ వీడియోని షేర్ చేస్తూ తాజాగా హీరో రిషబ్
శెట్టి తన ట్వి ట్టర్ X ద్వా రా తెలియజేశాడు. రిషబ్ శెట్టి మెసేజ్ చేస్తూ “నవ్వు , జ్ఞాపకాలు, ఆశీర్వాదాలు మరియు నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రియమైన సోదరుడు JrNTR తో పాటు మూడగల్లు కేశవనాథేశ్వర ఆలయ దర్శనం ఒక శుభప్రదమైన ప్రయాణం’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు