‘మత్తు వదలరా 3’ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్

‘మత్తు వదలరా 3’ గ్యారెంటీ అంటున్న డైరెక్టర్

Published on Sep 15, 2024 2:00 AM IST

శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘మత్తు వదలరా 2’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు రితేశ్ రానా ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేశ్ రానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ‘మత్తు వదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని.. అయితే, అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

దీంతో అభిమానుల్లో ‘మత్తు వదలరా 3’ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అందులో ఎలాంటి కథతో వస్తారా అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు