ఓటీటీలోకి సాయిరాం శంకర్ ‘వెయ్ దరువెయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి సాయిరాం శంకర్ ‘వెయ్ దరువెయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Oct 9, 2024 2:00 AM IST

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ తనదైన మూవీ సెలెక్షన్లతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలుగా నిలిచాయి. ఇక సాయిరాం శంకర్ నటించిన లాస్ట్ మూవీ ‘వెయ్ దరువెయ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా మార్చి 15న రిలీజ్ అయినా కూడా ఇప్పటివరకు డిజిటల్ స్ట్రీమింగ్‌కి రాలేదు. అయితే, ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ‘వెయ్ దరువెయ్’ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్‌కు తీసుకొస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా వెల్లడించింది.

‘వెయ్ దరువెయ్’ సినిమాలో యశ శివకుమార్, సునీల్, హెబ్బా పటేల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నవీన్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు