ప్రభాస్ “స్పిరిట్” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా!

ప్రభాస్ “స్పిరిట్” పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా!

Published on Apr 8, 2024 9:09 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చివరిసారిగా సలార్ (Salaar) మూవీ లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898AD (Kalki 2898AD) చిత్రం తో బిజీగా ఉన్నారు. అంతేకాక ది రాజా సాబ్ మరియు స్పిరిట్ చిత్రాలకి వర్క్ చేస్తున్నారు ప్రభాస్.

అయితే స్పిరిట్ చిత్రం ను డైరెక్ట్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ తనను యానిమల్ చిత్రం కి ముందే సంప్రదించినట్లు తెలిపారు. ఒక హాలీవుడ్ మూవీ ను రీమేక్ ఐడియా పై చర్చించినట్లు తెలిపారు. అయితే ఒరిజినల్ ఐడియా తో సినిమా చేద్దాం అని, ఆ తరువాత స్పిరిట్ ను నేరెట్ చేసినట్లు తెలిపారు. స్పిరిట్ తనకు నచ్చడం తో ప్రభాస్ ఓకే చెప్పారు అని అన్నారు. ఇప్పటి వరకూ 60 శాతం కి పైగా రైటింగ్ పూర్తి అయ్యింది అని, డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు